- Advertisement -
భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఎదుర్కొనేందుకు ఇంగ్లాండ్ ప్రత్యేక వ్యూహంతో సిద్ధమైనట్లు తెలుస్తోంది. బర్మింగ్హామ్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి అశ్విన్ ఏడు వికెట్లు పడగొట్టాడు.లార్డ్స్ వేదికగా గురువారం నుంచి జరగనున్న రెండో టెస్టులో అతనిపై ప్రత్యేక వ్యూహంతో బరిలో దిగుతున్నట్లు సమాచారం.
దీనిలో భాగంగానే జట్టులోకి యువ క్రికెటర్ ఆలీ పోప్ని తీసుకుంది ఇంగ్లండ్. ఇటీవల ఫస్ట్క్లాస్ క్రికెటర్ పోప్ అద్భుతంగా రాణిస్తున్నాడు. స్పిన్నర్లని ఆడటంలో ఈ 20 ఏళ్ల హిట్టర్ ప్రత్యేకత చూపాడు. దీంతో రేపు అతడిని ఇంగ్లాండ్ తుది జట్టులోకి తీసుకోవలని ఇంగ్లండ్ భావిస్తుంది.