ప్రపంచకప్లో విజయాలతో దూసుకుపోతున్న అతిథ్యజట్టు ఇంగ్లండ్కు శ్రీలంక భారీ షాక్ ఇచ్చింది. ఈ ప్రపంచకప్లో భారీ స్కోర్లను అలవోకగా బాదేస్తున్న ఇంగ్లండ్.. ప్రత్యర్థి నిర్దేశించిన స్వల్ప విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆపసోపాలు పడి చివరికి మరో 20 పరుగుల ముందే చేతులెత్తేసి ఓటమి పాలైంది. లంక బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 47 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లు లసిత్ మలింగ, ధనంజయ డిసెల్వ భయంకర బౌలింగ్కు బ్రిటిష్ బ్యాట్స్మెన్ పెవిలియన్ బాట పట్టారు. మలింగ నాలుగు వికెట్లు తీశాడు. ధనంజయ డిసెల్వ మూడు వికెట్లు పడగొట్టాడు. జో రూట్ (57), బెన్ స్టోక్స్ (82-నాటౌట్)లు కాసేపు ప్రతిఘటించినా పరాజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక పరుగులు చేయడానికి చాలా కష్టపడింది. ఓపెనర్లు కరుణరత్నె, పెరారా తీవ్రంగా నిరాశపరిచారు. మాథ్యూస్ (85 నాటౌట్), ఫెర్నాండో (49), మెండిస్ (46), ధనంజయ డిసెల్వ (29) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మిగిలిన వారు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, మార్క్ వుడ్ చెరో 3 వికెట్లు తీశారు.ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.