Monday, May 6, 2024
- Advertisement -

34 సంవ‌త్స‌రాల్లో టీమిండియా ఇదే అత్యంత చెత్త రికార్డు….

- Advertisement -

సొంతగడ్డపై అప్రతిహత సిరీస్‌ విజయాలతో జైత్రయాత్ర కొనసాగించిన కోహ్లీసేనకు సఫారీ గడ్డపై అడ్డుకట్ట పడింది. వరుసగా పదో సిరీస్‌ కైవసం చేసుకోవాలన్న ఆశలు అడియాసలు అయ్యాయి. సిరీస్‌ను 0-2 తో స‌ఫారీ జ‌ట్టు కౌవ‌సం చేసుకొంది. రెండు టెస్టుల్లో బ్యాటింగ్ వైఫ‌ల్యం కొంప‌ముంచింది.

భారత జట్టును బ్యాటింగ్ వైఫల్యం వేధిస్తోంది. బౌలర్లు మెరుగ్గానే రాణించినప్పటికీ.. బ్యాట్స్‌మెన్ చేతులు ఎత్తేయడంతో టెస్టు సిరీస్‌లో చెత్త ఆటతీరును కనబరుస్తోంది. టాపార్డర్ తీసికట్టుగా మారిన వేళ 34 ఏళ్ల తర్వాత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

కెప్‌టౌన్‌లో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్ అయిన భారత్ మలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 72 పరుగుల తేడాతో ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది.

తొలి టెస్టులో 92 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ మలి టెస్టులో 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుత పోరాటం ఫలితంగా 280 పరుగులు చేసిన చేసింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. 87 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శ‌ర్మ పోరాడినా ఫ‌లితం లేక‌పోయింది.

భారత జట్టు వంద పరుగుల్లోపు ఇంత తక్కువ వ్యవధిలో మూడుసార్లు ఏడు వికెట్లను కోల్పోవడం గత 34 ఏళ్లలో ఇదే తొలిసారి. 1983-84లో వెస్టిండీస్‌పై సొంత గడ్డ మీద ఇలా వికెట్లను కోల్పోయిన టీమిండియా.. టెస్టుల్లో నంబర్ 1 హోదాలో మళ్లీ ఇన్నాళ్లకు ఆ స్థాయిలో పేలమైన ప్రదర్శన చేయడం అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -