టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే నేడు మచిలీపట్నానికి రానున్నాడు. 15 కోట్ల రూపాయలతో పట్టణంలో నిర్మించనున్న తొలి మసులా స్పోర్ట్స్ కాంప్లెక్స్, అథ్లెటిక్ స్టేడియం భవనాలకు శంకుస్థాపన చేశారు. అలాగే, టీమిండియా తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించాడు.
సీకే నాయుడు ఎంతో మంది క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. సీకే నాయుడి సొంత ఊరిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తొలి క్రికెట్ కెప్టెన్ గా భారత క్రికెట్ కు ఆయన మార్గనిర్దేశం చేశారని అన్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహంతో, ఏపీలో ఉత్తమ క్రీడాకారులు తయారవుతున్నారని కితాబిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి చిన్నారి ఆటలు ఆడేలా చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, ఔత్సాహికులకు మంచి ట్రైనింగ్ కూడా కల్పిస్తున్నారని, వారిని భవిష్యత్ ఒలింపియన్లుగా మలిచేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.