Saturday, April 27, 2024
- Advertisement -

జ‌ట్టులో స్థానంకోసం గ‌ట్టిపోటీ ఉంది….ధావ‌న్‌

- Advertisement -

భార‌త జ‌ట్టులో స్థానంపై ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌ట్టులో యువ ఆట‌గాళ్ల‌తో విప‌రీత‌మైన పోటీ నెల‌కొంద‌న్నారు. యువ ఆటగాళ్లు త్వరగా పరిణితి సాధిస్తూ జట్టులో పోటీ పెంచుతున్నారని పేర్కొన్నాడు. ఫలితంగా జట్టులోని ప్రతి ఒక్కరు చోటు కోసం పోరాడాల్సి వస్తోందన్నాడు.

అండర్-19 సారథి పృథ్వీషా గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతడి సహచరుడు శుభ్‌మన్‌ గిల్‌ న్యూజిలాండ్‌ సిరీస్‌లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే రిషభ్‌ పంత్‌ స్థానం సుస్థిరం చేసుకున్నాడ‌న్నారు. పృథ్వీషా విండీస్‌ టెస్టులో శతకం, 70తో అదరగొట్టాడు. ఇది మన రిజర్వు బెంచ్‌ బలమేంటో చూపిస్తోంద‌న్నారు. తుది జట్టు సంగతేమో గానీ ఎంపికయ్యే 15 మందికీ విపరీతమైన పోటీ ఉంద‌ని తెలిపారు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పరిస్థితులు ఇంచుమించు ఒకేలా ఉంటాయన్నాడు. గతంలో కివీస్‌లో ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడెలా ఆడాలో తనకు తెలుసన్నాడు. తాను 5వేల ప‌రుగులు పూర్తి చేశానంటే బాగా ఆడుతున్న‌ట్టేన‌ని , అందుకు చాలా సంతోషంగా ఉద‌న్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -