వన్డే వరల్డ్ కప్ లో భారత్ – ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాకిస్ధాన్, న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ల్లో భారీ విజయాన్ని నమోదుచేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్లు టీమిండియాపైనే ఉన్నాయి. అక్టోబర్ 8న చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
అయితే తొలి వన్డేకు ముందే భారత్కు షాక్ల మీద షాక్లు తగులున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా తొలి వన్డేకు గిల్ దూరం కాగా తాజాగా హార్ధిక్ పాండ్యా కూడా గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరం కానున్నాడు.
నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా హార్దిక్ పాండ్య కుడి చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక అనారోగ్యం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు గిల్. దీంతో ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం కావడం భారత్కు కష్టమైన అంశమే.గిల్ స్ధానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్గా బరిలోకి దిగనుండగా పాండ్యా స్ధానంలో ఎవరికి తుదిజట్టులో స్ధానం దక్కుతుందో తెలియాల్సి ఉంది.