Saturday, May 4, 2024
- Advertisement -

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో తొలి స్థానాన్ని కోల్పోయిన విరాట్…

- Advertisement -

ఇప్పటి వరకు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మొదటి స్థానానని కోల్పోయాడు. ఇప్పటి వరకు రెండో స్థానంలో కొనసాగుతున్న స్మిత్….ఐసీసీ తాజాగా విడుదల చేసినర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

ప్రస్తుతం 904 రేటింగ్‌ పాయింట్లతో స్మిత్‌ ప్రథమ స్థానానికి చేరగా, కోహ్లి 903 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. వెస్టిండీస్‌ రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగడంతో టాప్‌ను స్మిత్‌కు చేజార్చుకోవాల్సి వచ్చింది. విలియమ్ సన్ మూడో స్థానంలో కొనసాగుతుండగా పుజారా నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.యాషెస్‌ సిరీస్‌లో నాల్గో టెస్టుకు స్మిత్‌ ఫిట్‌ కావడంతో అతను నంబర్‌ వన్‌ ర్యాంకును మరింత పదిలం చేసుకునే అవకాశం ఉంది.ఇక బౌలర్ల ర్యాంకింగ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా మూడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న బుమ్రా ఏడో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -