- Advertisement -
రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో లీడ్లోకి వచ్చింది. టీమిండియా విధించిన 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్…కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించి ఏకంగా ఐదు వికెట్లు తీయగా కుల్దీప్ రెండు వికెట్లు, బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు.
ఈ గెలుపుతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం ఆసీస్ తొలి స్ధానంలో ఉండగా టీమిండియా రెండో స్థానానికి చేరుకుంది.మూడో స్థానంలో ఇంగ్లాండ్, నాలుగో స్థానంలో సౌతాఫ్రికా, ఐదో స్థానంలో న్యూజిలాండ్ ఉన్నాయి.
ఈ నెల 23 నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుండగా ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టీమిండియా ఫస్ట్ ప్లేస్కు చేరుకుంటుంది.