Sunday, May 12, 2024
- Advertisement -

టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న బంగ్లా…..

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో రసవత్తర పోరు ఆరంభమైంది. కార్డిఫ్‌లో ఈరోజు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్ మొర్తజా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలో దిగుతున్నట్లు మొర్తజా చెప్పాడు. మొయిన్ అలీ స్థానంలో పాక్‌తో మ్యాచ్‌కు దూర‌మైన పేస‌ర్ ఫ్లంకెట్ ఇంగ్లీష్ తుది జ‌ట్టులో స్థానం సంపాదించాడు.

2015 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ను 15 పరుగుల తేడాతో ఓడించిన బంగ్లా జట్టు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో అప్పటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లీష్ ఆటగాళ్లు భావిస్తుండగా.. ఆతిథ్య జట్టుపై మరోసారి స్ఫూర్తిదాయక ప్రదర్శనతో విజయం సాధించాలని బంగ్లా పులులు ఆశిస్తున్నారు. రెండు జ‌ట్లు చివ‌రి మ్యాచ్‌ల్లో ఓటమి పాల‌య్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -