Sunday, May 5, 2024
- Advertisement -

మొద‌టిసారి భార‌త్‌, పాక్ అభిమానుల‌ను క‌లిపిన ప్ర‌పంచ‌క‌ప్‌….

- Advertisement -

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్క టీమిండియా విజ‌యం, ప‌రాజ‌యంపైనే మూడు దేశాల సెమీస్ ఆశ‌లు ఆదార‌ప‌డిఉన్నాయి. ఇద‌లా ఉంటె ఈసారి ఇండియాకు రెండు దేశాల అభిమానులు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఆ రెండు దేశాల్లో బ‌ద్ద శత్రువైన పాక్ మ‌రో వైపు బంగ్లా .

ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇప్ప‌టికే సెమీస్ బెర్త్ ఆస్ట్రేలియా ఖ‌రారు చేసుకుంది. న్యూజిలాండ్, ఇండియా కూడా సెమీస్ రేసులో ముందున్నాయి. ఈరెండు జ‌ట్లు దాదాపు సెమీస్ బెర్త్ కూడా కామ‌య‌మే. అయితే నాలుగో స్థానంకోసం పాక్‌, బంగ్లా, ఇంగ్లండ్ జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. ఇంగ్లాండ్ ఖాతాలో 8 పాయింట్లు ఉండగా.. బంగ్లా, పాకిస్థాన్ చెరో ఏడు పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లాండ్ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే సెమీస్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. లేదంటే బంగ్లా, పాక్ జట్లు ఓడాల్సి ఉంటుంది.

ఇంగ్లండ్ రేపు 30న టీమిండియాతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌‌లో ఇంగ్లాండ్ ఓడితే.. పాక్, బంగ్లా సెమీస్ అవకాశాలు మెరుగవుతున్నాయి. అందుకే ఇంగ్లాండ్‌పై భారత్ గెలవాలని పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భారత్ అంటేనే గిట్టని హార్డ్‌కోర్ పాకిస్థానీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు కోహ్లిసేనకు జైకొట్టాల్సిన అనివార్యత నెలకొంది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి 130 కోట్ల మంది భారతీయులు, 20 కోట్ల మంది పాకిస్థానీలు, 16 కోట్ల మంది బంగ్లాదేశీయులు బ్రిటిషర్లపై భారత్ గెలుపును కోరుకుంటున్నారని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. జూన్ 30న ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నున్న టీమిండియా మ్యాచ్‌లో ఎవరికి మద్దతు తెలుపుతారంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నజీర్ హుస్సేన్ ‌ట్విట్టర్‌లో పాకిస్తాన్ ఫ్యాన్స్ ని ప్రశ్నించాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. వారిలో 90 శాతానికి పైగా ఫ్యాన్స్ భారత్‌కు మద్దతు పలికిన సంగ‌తి తెలిసిందే. ఒకరు జైహింద్‌ అంటే.. మరొకరు వందేమాత‌రం.. ఇంకొకరు మేం మా పొరుగువారిని చాలా ప్రేమిస్తాం. మేం కచ్చితంగా భార‌త్‌కే మ‌ద్ద‌తిస్తాం వేరొకరు భారత్, పాకిస్థాన్ రెండూ ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా ఒక్కటవుతాయి అంటూ ఎవరి అభిప్రాయాలను వారు ట్వీట్ చేస్తున్నారు

భారత్‌ను సుదీర్ఘ కాలం పాలించిన ఇంగ్లాండ్.. దేశాన్ని రెండు ముక్కలు చేసింది. ఇప్పుడు అదే ఇంగ్లాండ్ కారణంగా.. పాకిస్థాన్, భారత్ ఒక్కటవుతున్నాయని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -