ఆప్ఘానిస్తాన్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ను భారత్ ఇప్పటికే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ మూడో టీ20 చిన్నస్వామి స్టేడియం వేదికగా ప్రారంభం కానుండగా ఈ మ్యాచ్లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది టీమిండియా. అయితే చాలాకాలం తర్వాత టీ20 మ్యాచ్లు ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పూర్తిగా నిరాశ పర్చారు.
ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ అయితే రెండు ఇన్నింగ్స్లో రెండు డకౌట్లతో పేలవ ప్రదర్శన కనబరచ్చాడు. దీంతో మ్యాచ్లోనైనా రోహిత్ రాణిస్తాడా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. విరాట్ కోహ్లీ గత మ్యాచ్ లో 29 పరుగులు చేయగా ఈ మ్యాచ్లో భారీ స్కోరు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక ఈ సిరీస్లో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. యశస్వీ జైస్వాల్, శివం దూబే అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. శివం దూబే గత రెండు మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీతో రానించగా జైస్వాల్ రెండో టీ20లో మెరుపు హాఫ్ సెంచరీతో ఆప్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి టీమిండియాకు షాకివ్వాలని భావిస్తోంది ఆప్ఘానిస్తాన్. మరి ఇవాళ జరిగే నామ మాత్రపు మ్యాచ్లో గెలుపు ఎవరిద అవుతుందో వేచిచూడాలి.