ప్రపంచకప్లో భాగంగా బంగ్లాతో టీమిండియా ఈరోజు కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానె సెమీస్ కు వెల్తుంది. అయితే ఈ మ్యాచ్లో బంగ్లా అభిమానులకు ఆ దేశ కెప్టెన్ మోర్తాజా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. భారత్తో మ్యాచ్ సమయంలో అభిమానులు హద్దులు దాటొద్దంటూ సూచించారు. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో నేడు బంగ్లాదేశ్తో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే.
ఈ టోర్నీలో భారత్ చాలా బలంగా ఉంది. ఆ జట్టును ఓడించడం అంత తేలిక కాదు. కానీ ఆఖరి బంతి వరకు శక్తిమేర పోరాడి విజయం కోసం ప్రయత్నిస్తాం. మేం ప్రపంచకప్లో ఉంటామా లేదా అనేది పక్కన పెడితే ఇప్పటివరకూ ఆడిన క్రికెట్ కన్నా ఈ మ్యాచ్లో ఇంకా మెరుగ్గా రాణించాలి అన్నారు.
ఈ మ్యాచ్లో గెలిస్తే 13 పాయింట్లతో కోహ్లీసేన నేరుగా సెమీస్కు దూసుకెళ్తుంది. మరోవైపు, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న బంగ్లా.. భారత్పై గెలిచి సెమీస్ రేసులో నిలవాలని చూస్తోంది. ప్రపంచకప్లో నిలిచినా నిలవకపోయినా భారత్పై మాత్రం గెలవాలని పట్టుదలతో ఉంది. ఇదిలా ఉంటే, భారత్తో మ్యాచ్ అనగానే బంగ్లాదేశ్ అభిమానులు రెచ్చిపోతారు. అందుకే బర్మింగ్హామ్లో ఓ న్యూస్ వెబ్సైట్తో మాట్లాడిన మొర్తాజా అభిమానులు హద్దులు మీరి ప్రవర్తించకూడదని అన్నారు.