భారత్ – దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ కీలకమైన మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో ఒకటి టీమిండియా, మరోకటి దక్షిణాఫ్రికా గెలిచాయి.ఇక ఇవాళ జరిగే నిర్ణయాత్మక పోరులో గెలిచి సిరీస్ గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు ఇరు జట్లు.
భారత బౌలర్లకు తోడుగా బ్యాట్స్మెన్ రాణిస్తే టీమిండియా గెలుపు పక్కా. ఈ సిరీస్లో నిలకడగా రాణిస్తున్నారు ఓపెనర్ సాయి సుదర్శన్. రెండు మ్యాచ్ల్లో బ్యాక్ టూ బ్యాక్ హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఇక తెలంగాణ కుర్రాఉడ తిలక్ వర్మ,కేఎల్ రాహుల్ రాణిస్తే టీమిండియా గెలుపు పక్కా. బౌలింగ్లో అర్ష్దీప్, అవేశ్, ముఖేశ్, కుల్దీప్ కీలకం కానున్నారు.
ఇక ఈ మ్యాచ్లో గెలిచి సొంతగడ్డపై సిరీస్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది దక్షిణాఫ్రికా. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన దక్షిణాఫ్రికా నయా ఓపెనర్ జోర్జితో పాటు, మార్క్మ్, హెన్రిక్స్, క్లాసెన్, మిల్లర్, డసెన్ సత్తాచాటితే సఫారీల గెలుపు పక్కా.