Sunday, April 28, 2024
- Advertisement -

సూర్య అదుర్స్..సిరీస్ సమం

- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను సమం చేసింది టీమిండియా. కీలకమైన మూడో టీ20లో బ్యాటింగ్,బౌలింగ్ అన్ని రంగాల్లో రాణించి దక్షిణాఫ్రికాపై భారీ విజయం సాధించింది. భారత్ విధించిన 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులకు ఆలౌటైంది. మార్క్మ్‌ (25), డేవిడ్‌ మిల్లర్‌ (35) పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. దీంతో సఫారీ జట్టు ఓటమి తప్పలేదు. కుల్దీప్‌ యాదవ్‌ 5, జడేజా రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో సెంచరీ చేసి రాణించాడు. 56 బంతుల్లో 8 సిక్స్‌లు,7 ఫోర్లతో 100 పరుగులు చేశారు. సూర్య కెరీర్‌లో ఇది నాలుగో సెంచరీ. యశస్వి జైస్వాల్‌ 41 3 సిక్స్‌లు, 6 ఫోర్లతో 60 పరుగులు చేయగా శుభ్‌మన్‌ గిల్‌ (15), తిలక్‌ వర్మ (0), రింకూసింగ్‌ (14), జితేశ్‌ శర్మ (4), రవీంద్ర జడేజా (4) విఫలమయ్యారు. సూర్యకుమార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ తో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -