Friday, March 29, 2024
- Advertisement -

సఫారీలతో టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ కు ఎదురుదెబ్బ….బూమ్రా ఔట్

- Advertisement -

సఫారీలతో టెస్ట్ సిరీస్ కు ముందు టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తాజాగా గాయపడటంతో.. అతడ్ని జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు మరో ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌ని ఎంపిక చేశారు. దీంతో బూమ్రా టెస్ట్ సిరీస్ మొత్తం దూరం అయ్యారు.ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో అత్యుత్తమంగా రాణించిన జస్‌ప్రీత్ బుమ్రా హ్యాట్రిక్ వికెట్లతో సరికొత్త రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే.

అక్టోబర్ 2 నుంచి విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్ కోసం టీ20 నుంచి బూమ్రాకు విశ్రాంతి ఇచ్చింది టీమ్ మేనేజ్ మెంట్.అనుకోకుండా బుమ్రా వెన్నుకి చిన్న గాయమైందని చెప్పుకొచ్చి టీమిండియా మేనేజ్‌మెంట్.. సిరీస్‌ మొత్తానికీ అతను దూరంగా ఉండనున్నట్లు ప్రకటించింది. ఇది కోహ్లీ సేనకు ఇబ్బందికర పరిస్థితే.

భారత టెస్టు జట్టు:

విరాట్ కోహ్లి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాహా (రెండో వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, శుభమన్ గిల్, ఉమేశ్ యాదవ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -