- Advertisement -
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య గయానాలో జరగాల్సిన మొదటి వన్డేకు వర్షం కారణంగా రద్దయ్యింది. ఇప్పుడు రెండో వన్డే కూడా జరిగే సూచనలు కనిపించడంలేదు. రెండో వన్డేకి కూడా వరణుడు విలన్ గా మారనున్నారు. రేపు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు జరగాల్సిన మ్యాచ్కు కూడా వర్షం అడ్డంకిగా మారనుందని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది.
గయానా వేదికగా గురువారం రాత్రి ముగిసిన తొలి వన్డేకి వరుణుడు పదే పదే అంతరాయం కలిగించడంతో మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే . వెస్టిండీస్తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్ని 3-0తో చేజిక్కించుకున్న టీమిండియా.. వన్డే సిరీస్లోనూ గెలవాలని పట్టుదలతో ఉంది. మరో వైపు సొంత గడ్డపై వన్డే సిరీస్ గెలిచి పరువు నిలుపుకోవాలని విండీస్ కూడా భావిస్తోంది.