భారత్-వెస్టిండీస్ మధ్య ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో ఆసిక్తకర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుంటూ మైదానంలో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి వద్దకు పరుగెత్తాడు. అభిమాని చేష్టలకు కోహ్లీ అవాక్కయ్యారు.
పరుగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చిన అభిమాని వెంటనే కోహ్లీని హత్తుకుని నానా హంగామా చేశాడు. అంతేకాదు కోహ్లీకి ముద్దు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. దీంతో కోహ్లీ వారించడంతో సెల్ఫీ మాత్రమే తీసుకున్నాడు. అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్, పృథ్వీషా చేరుకునే సరికి వారితో కూడా సెల్పీ దిగాడు
కోహ్లీ దగ్గరికి వెళ్లిన అతను కౌగలించుకుని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే.. సెల్ఫీ తీసుకునేందుకు అభిమానికి సహకరించిన కోహ్లీ.. హగ్కి మాత్రం అనుమతించలేదు. అప్పటికే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది బలవంతంగా అభిమానిని మైదానం వెలుపలికి తీసుకెళ్లారు.