- Advertisement -
ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ముంబయి వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సారథి విరాట్ కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఇరుజట్లు మూడు వన్డేలు ఆడగా 1-1తో సమంగా నిలిచాయి.
యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో కేదార్ జాదవ్ను జట్టులోకి తీసుకున్నారు. యుజువేంద్ర చాహల్ స్థానాన్ని సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో భర్తీ చేశారు. సిరీస్ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్లో భారత్ తప్పక గెలవాల్సిందే.
Toss won. We will bat first 💪#INDvWI pic.twitter.com/GQQAxDV5WX
— BCCI (@BCCI) October 29, 2018