వెస్టిండీస్తో మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ధర్డ్ అంపైర్ క్యాచ్ ఔట్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఆర్ఎస్ టెక్నాలజీ, అంపైర్ నిర్ణయంపై క్రికెటర్లు, విశ్లేషకులు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బంతి, బ్యాట్కు మధ్య కొంత ఖాళీ ఉన్నట్లు స్పష్టంగా కన్పిస్తున్నప్పటికీ ఔట్గా ప్రకటించారని రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా దీనిపై ట్విట్టర్లో రోహిత్ స్పందించాడు.
తాను ఔటైన తీరును ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఆ ఔట్ను జూమ్ చేసి మరీ అభిమానులకు తెలియజేశాడు. ఈ క్రమంలోనే తలపట్టుకున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. ‘ ఇప్పుడు చెప్పండి.. ఇది ఔటా’ అని రోహిత్ కోరుతున్నట్లు ఉన్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కీమర్ రోచ్ బౌలింగ్లో రోహిత్ శర్మ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్, ప్యాడ్కు మధ్యలో నుంచి వెళ్లి వికెట్ కీపర్ షెయ్ హోప్ చేతిలో పడింది. విండీస్ అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించడంతో రివ్యూ కోరింది. రీప్లేలో స్నికోలో కన్పించిన స్పైక్ ఆధారంగా థర్డ్ అంపైర్ మైఖేల్ గాఫ్ ఔట్గా ప్రకటించారు. బంతి బ్యాట్కు తాకినట్లు స్పష్టంగా ఏమీ కన్పించలేదు. . దీనిపై పూర్తి స్పష్టత లేకపోయినా మూడో అంపైర్ భారత్కు వ్యతిరేకంగా ఔటివ్వడంతో అంతా అవాక్కయ్యారు.