Monday, May 20, 2024
- Advertisement -

వ‌చ్చే ఏడాది ముక్కోణ‌పు సిరీస్‌ ఆడ‌నున్న ఇండియా..

- Advertisement -

వచ్చే ఏడాది టీమిండియా వరుస సిరీస్‌లతో బిజిబిజీగా గడపనుంది. మార్చిలో ముక్కోణపు టీ20 సిరీస్‌ కోసం భారత్‌.. శ్రీలంక వెళ్లనుంది. భారత్‌-శ్రీలంక-బంగ్లాదేశ్‌ మధ్య ఈ సిరీస్‌ జరగనుంది. మార్చి 8న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌ 20తో ముగుస్తుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

వచ్చే ఏడాది శ్రీలంక 70వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకోనుంది. ఈ నేప‌థ్యంలో ముక్కోణపు సిరీస్‌ నిర్వహించడం ప‌ట్ల ఆస‌క్తి చూపిన‌ బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డులతో సంప్రదింపులు జరిపి విజ‌య‌వంత‌మైంది. శ్రీలంక కోరిక మేర‌కు భార‌త్, బంగ్లాదేశ్‌ బోర్డులు వచ్చే ఏడాది మార్చి 8 నుంచి 20 మధ్య ముక్కోణపు టోర్నీ నిర్వహిస్తామ‌ని తెలిపాయి.

ముక్కోణ‌పు శిరీష్ గురించి శ్రీలంక క్రికెట్ బోర్డు ప్ర‌తినిధులు మాట్లాడుతూ… కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి జట్టు మిగతా రెండు జట్లతో రెండేసి మ్యాచులు ఆడతుందని చెప్పారు. అన్ని మ్యాచ్‌లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -