Friday, May 17, 2024
- Advertisement -

సెంచరీతో చెలరేగిన రోహిత్‌..భార‌త్ ఘ‌న విజ‌యం

- Advertisement -

ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 49.5 ఓవర్లలో 268 పరుగుల వద్ద ఆలౌటైంది. జోస్‌ బట్లర్‌ (51 బంతుల్లో 53; 5 ఫోర్లు), బెన్‌ స్టోక్స్‌ (103 బంతుల్లో 50; 2 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 40.1 ఓవర్లలో 2 వికెట్లకు 269 పరుగులు చేసి గెలిచింది.మొదట పటిష్టస్థితిలో ఉన్న ఇంగ్లిష్‌ ఇన్నింగ్స్‌ ఆ తర్వాత కుల్దీప్‌ ‘మణికట్టు’ మాయలో పడింది.

ఇంగ్లండ్‌ మరోసారి చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ (6/25) స్పిన్‌లో చిక్కుకుంది. రోహిత్‌ శర్మ (114 బంతుల్లో 137 నాటౌట్‌; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) కెరీర్‌లో 18వ సెంచరీతో చెలరేగగా, విరాట్‌ కోహ్లి (82 బంతుల్లో 75; 7 ఫోర్లు) రాణించాడు. కుల్దీప్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -