మెల్బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియాకు భారత జట్టుకు చుక్కలు చూపింది. ఇండియన్ పేసర్ల ధాటికి కంగారు జట్టు విలవిల్లాడింది. 151 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ హ్యారిస్ (22), ఉస్మాన్ ఖవాజా (21), టిమ్ పైన్ (22), ట్రావిస్ (20) ఫరవాలేదనిపించినా..చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. మిగతా బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమయ్యారు.
తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 443 పరుగులు చేసిన భారత్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. కానీ, ఈ రోజు మాత్రం భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా కుప్పకూలింది. 66.5 ఓవర్లను ఎదుర్కొన్న ఆసీస్ 151 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రా 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి ఆసీస్ నడ్డి విరిచాడు.
ఆసీస్ బ్యాట్స్ మెన్లలో హారిస్ 22, ఫించ్ 8, ఖవాజా 21, షాన్ మార్ష్ 19, హెడ్ 20, మిచెల్ మార్ష్ 9, పైన్ 22, కమిన్స్ 17 పరుగులు చేయగా లియోన్, హాజిల్ వుడ్ లు డకౌట్ అయ్యారు. స్టార్క్ 7 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఫించ్ ఔట్ చేసి ఇషాంత్ శర్మ భారత్కు శుభారంభాన్ని అందించగా బూమ్రా ఫినిసింగ్ టచ్ ఇచ్చాడు.
భారత బౌలర్లలో బుమ్రా 6, జడేజా 2 వికెట్లు తీయగా శర్మ, షమీలు చెరో వికెట్ తీశారు. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 292 పరుగుల లీడ్ సాధించింది. ఆసీస్ కు ఫాలోఆన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ… భారత్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.