మెల్ బోర్న్ వేదికగా రేపటి నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టు కోసం భారత్ తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమ్లో ఏకంగా మూడు మార్పులు చేశారు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్లపై మేనేజ్మెంట్ వేటు వేసింది. సిరీస్ 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు స్పిన్నర్ అశ్విన్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మూడో టెస్టుకూ దూరం కానున్నాడు. అటు పేస్బౌలర్ ఉమేష్ యాదవ్ను కూడా తప్పించారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకున్నారు. వెన్ను నొప్పితో రెండో టెస్టు ఆడని రోహిత్ శర్మ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు.
నాలుగు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్టులు పూర్తికాగా, ఇరు జట్లూ చెరో మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా సిరీస్ లో పైచేయి సాధించడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా, ఇండియాలు వ్యూహాలు పన్నుతున్నాయి.
భారత జట్టు:
విరాట్ కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, చటేశ్వర పుజారా, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా