Tuesday, April 30, 2024
- Advertisement -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా..జ‌ట్టులో నాలుగు మార్పులు

- Advertisement -

ఆస్ట్రేలియాతో మొహాలి వేదికగా ఆదివారం జరుగుతున్న నాలుగో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్ప‌టికే మొద‌టి రెండు వ‌న్డేల్లో గెలిచిన భార‌త్‌…రాంచీలో జ‌రిగిన మూడో వ‌న్డేలో ఓట‌మి పాల‌య్యింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవ‌సం చేసుకోవాల‌ని కోహ్లీ సేన ప‌ట్టుద‌ల‌తో ఉంటే…సిరీస్‌ను స‌మ‌యం చేయాల‌ని ఆసిస్ ఉంది. ఇరుజ‌ట్ల‌కు ఈ మ్యాచ్ కీల‌కం కానుంది. మరోవైపు రాంచీ వన్డేలో కోహ్లీ అసాధారణ శతకం బాదినా.. విజయాన్ని అందుకోలేకపోయిన టీమిండియా ఈరోజు పుంజుకుని ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్‌ చేజిక్కించుకోవాలని ఆశిస్తోంది. జ‌ట్టులో కోహ్లీ నాలుగు మార్పులు చేశారు. ధోని స్థానంలో పంత్‌, రాయుడి స్థానంలో కేఎల్ రాహుల్‌, మహ్మద్ షమీ స్థానంలో భువనేశ్వర్, జడేజా స్థానంలో చాహల్‌కి తుది జట్టులో చోటిచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -