ఆసిస్ త్వరలో ఇండియా టూర్కు రానుంది. ఈనెల 24 నుంచి ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో రెండు టీ20లు, ఐదు వన్డేలలో తలపడనుంది. ఈ రెండు సిరీస్ల కోసం 16 మందితో కూడిన జట్టుని ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ టూర్కి ఆసిస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ను తప్పించారు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో స్టార్క్ గాయపడ్డాడు. అతని భుజం పట్టేయడంతో.. చేయి, ఛాతిలో నొప్పి వస్తోంది. దీంతో స్టార్క్ను వన్డే, టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదు.
ఆసీస్ జట్టుకు ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. స్టార్క్ స్థానంలో కేన్ రిచర్డ్సన్ని ఎంపిక చేశారు. షాన్ మార్ష్ తన భార్య ప్రసవానంతరం జట్టుతో చేరుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అప్పటి వరకూ అతని స్థానంలో డీఆర్క్ షార్ట్ జట్టులో ఉంటాడు. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్, హేజల్వుడ్, పీటర్ సిడిల్లను ఎంపిక చేయలేదు. ఈనెల 24న వైజాగ్లో టీ20 మ్యాచ్తో సిరీస్ ప్రారంభం అవుతుంది. 27న బెంగుళూరులో రెండవ టీ20 ఆడుతారు. మార్చి 2వ తేదీన హైదరాబాద్లో మొదటి వన్డే ఉంటుంది. ఆ తర్వాత నాగపూర్, రాంచీ, మొహాలీ, ఢిల్లీల్లో వన్డేలు ఉంటాయి.
ఆస్ట్రేలియా టీ20, వన్డే జట్టు :
అరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), జేసన్ బెరెండ్రాఫ్, కౌల్టర్ నైల్, పీటర్ హ్యాండ్స్కబ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లయన్, షాన్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, జీ రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, మార్కస్ స్టాయినిస్, ఆస్టన్ టర్నర్, ఆడమ్ జంపా, డీఆర్క్షార్ట్.