భారత్, బంగ్లాదేశ్ల మధ్య కొలంబోలో జరుగుతోన్న టీ20 మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో లిటాన్ దాస్(34), షబ్బిర్ రెహ్మాన్(30)లు మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు కుదురుగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. ఉనాద్కత్ మూడు వికెట్లతో రాణించగా, విజయ్ శంకర్ రెండు వికెట్లతో మెరిశాడు. ఇక శార్దూల్ ఠాకూర్, చాహల్లకు చెరో వికెట్ లభించింది.
బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లో తమిమ్ ఇక్బల్ 15, సౌమ్య సర్కార్ 14, లిటోన్ దాస్ 34, రహీమ్ 18, మహ్మదుల్లా 1, షబ్బీర్ రెహ్మాన్ 30, మెహిదీ మాసన్ 3, టాస్కిన్ అహ్మద్ 8, రుబెల్ హాసన్ 0, ముస్తాఫిజర్ రహ్మాన్ 1 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జయ్దేవ్ మూడు వికెట్లు తీయగా, విజయ్ శంకర్ 2, శార్దూల్ ఠాకూర్, ఛాహెల్ తలో వికెట్ తీశారు.