Wednesday, May 8, 2024
- Advertisement -

రోహిత్ స్థానంలో కెఎల్ రాహుల్‌

- Advertisement -

శ్రీలంక‌లో జ‌రుతున్న ముక్కోణ‌పు సిరీస్‌లో భార‌త జ‌ట్టు బ్యాటింగ్‌లో మార్పులు చోటుచేసుకోకున్నాయి. ప్ర‌ధానంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మార్పు ఉండ‌బోతోంది. భారత తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ ఏడాది ఆరంభం నుంచి పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దక్షిణాఫ్రికాతో ముగిసిన సుదీర్ఘ సిరీస్‌లో ఒక శతకం మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ఈ ఓపెనర్.. కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లోనూ ఘెరంగా విఫలమవుతున్నాడు.

ఇప్పటికే ముగిసిన మూడు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మ చేసిన పరుగులు 0, 17, 11 మాత్రమే. దీంతో.. టీమిండియా మేనేజ్‌మెంట్ సూచన మేరకు ఓపెనర్ స్థానం నుంచి మిడిలార్డర్‌‌లోకి మారాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడట. ఈరోజు రాత్రి 7 గంటలకి భారత్, బంగ్లాదేశ్ మధ్య టోర్నీలో భాగంగా ఐదో మ్యాచ్ జరగనుంది.

కెరీర్‌ ఆరంభంలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మను అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఓపెనర్‌గా పంపించి ప్రయోగం చేశాడు. ఈ బ్యాటింగ్ మార్పు మంచి ఫలితాలు ఇవ్వడంతో.. వన్డే, టీ20ల్లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా జట్టులో సెటిలైపోయాడు.

అయితే తాజా వైఫల్యాల నేపథ్యంలో కేఎల్ రాహుల్‌ని ఓపెనర్‌గా పంపి.. రోహిత్ శర్మని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ఐపీఎల్ 2017 సీజన్‌లోనూ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ.. జట్టుకి ఏకంగా టైటిల్‌‌ని అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మార్పుపై మేనేజ్‌మెంట్ ప్ర‌క‌టించ‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -