ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా బుధవారం జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టుపై టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో ఫైనల్ బెర్తుకి చేరువైన టీమిండియా ఉత్సాహంగా బరిలోకి దిగుతుండగా.. గత శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై భారీ లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్ గెలుపు బాటని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. టోర్నీలో ఇప్పటికే ఓ సారి భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఇరు జట్లలో స్పల్ప మార్చులు చోటు చేసుకున్నాయి. భారత జట్టులో జయదేవ్ ఉనద్కత్ స్థానంలోకి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. గత రెండు టీ20లకు బెంచ్కే పరిమితమైన ఈ హైదరాబాదీకి ఈ మ్యాచ్లో ఎట్టకేలకు అవకాశం లభించింది. ఇక బంగ్లాదేశ్ జట్టులో టస్కిన్ స్థానంలో అబూ హైదర్ను తీసుకున్నారు
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, చాహల్