మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లలో ఓడిపోయిన ఇండియా ట్రెంట్బ్రిడ్జ్ టెస్ట్లో ఇండియా పట్టు బిగించింది.హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కుప్పకూల్చి 168 పరుగుల భారీ ఆధిక్యం అందుకుంది టీమిండియా.రెండో ఇన్నింగ్స్లోనూ దూకుడుగా ఆడి ఓవరాల్ ఆధిక్యాన్ని 292 పరుగులకు పెంచుకుంది. ఫలితంగా రెండో రోజే టీమిండియా మ్యాచ్ను తమ చేతుల్లోకి తెచ్చుకుంది.ఒక దశలో 54/0తో ఉన్న ఇంగ్లండ్ ఒక్క సెషన్లోనే 115 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోవడం విశేషం.
హార్దిక్ పాండ్యా (5/28) కేవలం 29 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. రెండో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (44, 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (36, 7 ఫోర్లు) వేగంగా ఆడి వెనుదిరగ్గా… ప్రస్తుతం పుజారా (33 బ్యాటింగ్), కోహ్లి (8 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు.