భారత్-కివీస్ జట్ల మధ్య ప్టస్టెస్ట్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతోంది. దీంతో భారత క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. జట్టులో సరైన ప్లేయర్లు ఉన్నారా ? భారత బ్యాటింగ్ విభాగం, బోలింగ్ విభాగం పటిష్టంగా ఉందా? సినియర్ జూనియర్లకు కొత్త కోచ్ గ్రేట్ వాల్ రాహుల్ ద్రావిడ్ ఎలాంటి సూచనలు ఇవ్వనున్నారనేది ప్రస్తుతం హట్ పాపిక్గా మారింది.
కివీస్కు భారత గడ్డపై ఆడిన అనుభవం కొత్తేంకాదు. అందులో ఐపీఎల్ ఫూణ్యమాని బ్లాక్ క్యాప్స్కి స్పిన్ పీచ్ను కూడా అలవాటు చేసుకున్నారు. జీవం లేని పిచ్లపై వాళ్లు భారత జట్టును గట్టి దెబ్బతీయాలని చూస్తున్నారు. దీనికి మన దగ్గర కొత్త రక్తం ఉరకలేస్తుంది. అందులోటి ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ప్లేయర్లలో దాదాపు 90 శాతం మంది ద్రావిడ్ కింద శిక్షణ పొందిన వారే ఉన్నారు. దీనిని హెడ్ కోచ్ సానుకూలంగా మలుచుకొవాలని సలహాలు ఇవ్వనున్నారు.
కివీస్ బౌలర్లలో బౌల్ట్ లాంటి సూపర్ స్టార్ బౌలర్లున్నారు. విలియమ్సన్ లాంటి గ్రేట్ బ్యాటింగ్ బలం వారికి ఉంది. వీరితో పటిష్టమైన లైనఫ్ ఉన్న భారత జట్టు తలపడనుంది. తాత్కాలిక కెప్టెన్ రహనే ఈ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. ఈ మ్యాచ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరమవ్వడంతో అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఎవ్వరిని ఏ స్థానంలో ఆడించాలో, ఏ సమయంలో ఏవ్వరికి బాల్ ఇవ్వాలో అనే విషయంలో ద్రవిడ్ను మించిన వారులేరు. స్విప్లో ఉండే అన్ని గమనించే సీనియర్ బ్యాట్స్మెన్ పుజారా లాంటి ఆటగాళ్లను ఎలా ఆడించాలో ద్రావిడ్ ముందే ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు. తాను జాతీయ జట్టుకు హెడ్ కోచ్గా జట్టకు శుభారంబం ఇవ్వాలని చూస్తున్నాడు. దీనికోసం ప్లేయర్లను సిద్దం చేస్తున్నాడు.