తొలి ప్రపంచకప్ ఆడుతున్న టీమిండియా పకడ్బందీగా బౌలింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలకు ఆదిలోనె ఎదురు దెబ్బ తగిలింది. బూమ్రా చెలరేగడంతో సఫారీలు రెండు వికెట్లు కోల్పోయింది. వన్డే వరల్డ్కప్లో భాగంగా దక్షిణాఫ్రికా జరుగుతున్న మ్యాచ్లో బుమ్రా శుభారంభం అందించాడు. సఫారీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా వికెట్ను సాధించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో భాగంగా నాల్గో ఓవర్ రెండో బంతిని బుమ్రా ఆఫ్ స్టంప్పై గుడ్ లెంగ్త్లో సంధించాడు. దానికి తడబడిన ఆమ్లా.. రోహిత్కు స్లిప్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
తన తర్వాతి ఓవర్లోనే ఓపెనర్ డికాక్ను ఔట్ చేసి భారత్కు శుభారంభం అందించాడు.ఆరో ఓవర్ ఐదో బంతికి డీకాక్ స్లిప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్యాచ్ను థర్డ్ స్లిప్లో ఉన్న విరాట్ కోహ్లి అందుకున్నాడు. దాంతో దక్షిణాఫ్రికా 24 పరుగుల వద్ద ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది . ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ పట్టడంతో దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయి 12 ఓవర్లకు 40 పరుగులు చేసింది. క్రీజ్ లో డుప్లెసిస్(15), వాన్ డర్ డస్సెన్(8) పరుగులతో ఉన్నారు.