సఫారీలతో డర్బన్లో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ జట్టు ఆటగాళ్లు అదరగొట్టారు. కెప్టెన్ కోహ్లీ సెంచరీతో చెలేగగా బౌలర్లు విజయంలో తమ పాత్ర పోషించారు. సఫారీజట్టు నిర్నీత 5ం వోర్లల్లో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ డుప్లెసిస్ శతకంతో ఆకట్టుకొన్నారు.
270 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగిన భారత్ 4 వికెట్లు కోల్పోయి 45.5 ఓవర్లలో వన్డేను ముగించారు. కెప్టెన్ కోహ్లి (119 బంతుల్లో 112; 10 ఫోర్లు) వన్డేల్లో 33వ శతకం సాధించగా… అజింక్య రహానే (86 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వన్డే సిరిస్లో భారత్ 1–0తో ముందంజలో ఉంది.
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరిస్ ఓటమి తర్వాత వన్డే సిరిస్లో భాగంగా కింగ్స్మీడ్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ శుభారంభం చేసింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు అత్యత్తమ ప్రదర్శన కనబరిచారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందనలతో ముంచెత్తారు. కోహ్లి, రహానేల కీలక భాగస్వామ్యం భారత్ను విజయతీరాలకు చేర్పించిందని ట్విట్టర్ ద్వారా అభినందించారు.
Two great partnerships to take India to victory. First, @imkuldeep18 along with @yuzi_chahal and then @imVkohli with @ajinkyarahane88. Great work, boys. Keep up the momentum, #TeamIndia. #INDvSA pic.twitter.com/tQnfETAuco
— Sachin Tendulkar (@sachin_rt) February 2, 2018