Thursday, May 2, 2024
- Advertisement -

వ‌న్డేలో టీమిండియా ఘ‌న‌విజ‌యంపై ట్విట్ట‌ర్ ద్వారా ట్వీట్ చేసిన స‌చిన్‌…

- Advertisement -

స‌ఫారీల‌తో డ‌ర్బ‌న్‌లో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ జ‌ట్టు ఆట‌గాళ్లు అద‌ర‌గొట్టారు. కెప్టెన్ కోహ్లీ సెంచ‌రీతో చెలేగ‌గా బౌల‌ర్లు విజ‌యంలో త‌మ పాత్ర పోషించారు. స‌ఫారీజ‌ట్టు నిర్నీత 5ం వోర్ల‌ల్లో 8 వికెట్ల న‌ష్టానికి 269 ప‌రుగులు చేసింది. జ‌ట్టు కెప్టెన్ డుప్లెసిస్ శ‌త‌కంతో ఆక‌ట్టుకొన్నారు.

270 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకిదిగిన భార‌త్ 4 వికెట్లు కోల్పోయి 45.5 ఓవ‌ర్ల‌లో వ‌న్డేను ముగించారు. కెప్టెన్‌ కోహ్లి (119 బంతుల్లో 112; 10 ఫోర్లు) వన్డేల్లో 33వ శతకం సాధించగా… అజింక్య రహానే (86 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వన్డే సిరిస్‌లో భారత్‌ 1–0తో ముందంజలో ఉంది.

దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరిస్‌ ఓటమి తర్వాత వన్డే సిరిస్‌లో భాగంగా కింగ్స్‌మీడ్‌ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అత్యత్తమ ప్రదర్శన కనబరిచారని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభినందనలతో ముంచెత్తారు. కోహ్లి, రహానేల కీలక భాగస్వామ్యం భారత్‌ను విజయతీరాలకు చేర్పించిందని ట్విట్ట‌ర్ ద్వారా అభినందించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -