Tuesday, May 7, 2024
- Advertisement -

ఆదిలోనే టీమిండియాకు షాక్‌ .. రెండు వికెట్లు డ‌మాల్‌

- Advertisement -

ఆతిథ్య దక్షిణాఫ్రికాతో చివరి టెస్టులో భారత జట్టు వికెట్ల పతనం మొదలైంది. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి భారత ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్ చేరారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ బాటపట్టాడు. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మురళీ విజయ్‌-కేఎల్‌ రాహుల్‌ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. 3.1వ ఓవర్ల్లో ఫిలాండర్‌ వేసిన బంతి ఇన్‌సైడ్‌లో అంచును తాకి వెనక్కి వెళ్లింది. వికెట్‌ కీపర్‌ డీకాక్‌ దాన్ని పట్టుకున్నాడు. దీంతో కేఎల్‌ రాహుల్‌ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరుకున్నాడు.

అనంతరం రబడా వేసిన బౌలింగ్‌లో మరో ఓపెనర్ మురళీ విజయ్(8) వెనుదిరిగాడు. దీంతో ప్రస్తుతం13 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ(6), చతేశ్వర్ పుజరా(0) ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -