Monday, April 29, 2024
- Advertisement -

భార‌త్‌తో టెస్ట్ సిరీస్‌కు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ఇదే….

- Advertisement -

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జనవరి 5వ తేదీ నుంచి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. కేప్‌టౌన్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాఫ్రికాక్రికెట్‌ బోర్డు కేప్‌టౌన్ టెస్టులో కోహ్లీ సేనతో తలపడే జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు డుప్లిసిస్‌ నాయకత్వం వహిస్తున్నాడు.

నూతన సంవత్సరం ఆరంభంలోనే భారత క్రికెట్ జట్టుకు దక్షిణాఫ్రికా పర్యటన రూపంలో కఠిన సవాల్ ఎదురు కాబోతోంది. ఇప్పటికే భారత క్రికెటర్లు సఫారీ గడ్డ మీద అడుగు పెట్టారు. 2017లో స్వదేశంలోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడి విజయవంతమైన కోహ్లి సేన.. జైత్రయాత్రను కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. భారత జట్టు దక్షిణాఫ్రికాలో మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలి టెస్టు కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది.

బలమైన భారత జట్టును ఢీకొట్టేందుకు దక్షిణాఫ్రికా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోందని జట్టు ఎంపికను బట్టి స్పష్టం అవుతోంది. ఏబీ డివిలియర్స్ రెండేళ్ల తర్వాత భారత సిరీస్‌కు ముందే టెస్టు జట్టులో చేరిపోయాడు. పేసర్ డేల్ స్టెయిన్ కూడా రెండేళ్ల విరామం తర్వాత భారత్‌తో సిరీస్ ఆడేందుకు బరిలో దిగుతున్నాడు. జింబాబ్వేతో టెస్టుకు దూరమైన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు. దీంతో అతడు న్యూలాండ్స్‌లో జరగనున్న టెస్టులో బరిలో దిగనున్నాడు.

దక్షిణాఫ్రికా జట్టు: డుప్లెసిస్ (కెప్టెన్), హషీమ్ ఆమ్లా, బవుమా, డికాక్, థెయునిస్ డి బ్రుయిన్, ఏబీ డివిలియర్స్, డీన్ ఎల్గార్, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్కరమ్, మోర్నే మోర్కెల్, క్రిస్ మోరిస్, ఆండిలే పెహ్లుక్వాయో, వెర్నార్ ఫిలాండర్, కగిసో రబాడ, డేల్ స్టెయిన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -