Tuesday, May 7, 2024
- Advertisement -

ధోనీ వస్తున్నాడు… వ‌న్డేల్లో త‌ల‌రాత మారుతుంది: శ్రేయస్ అయ్యర్

- Advertisement -

దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా భారత క్రికెట్‌ జట్టులో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కలవడం తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ‍్యర్‌ పేర్కొన్నాడు. ఇప్పటికే టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను దక్కించుకుంటుందనే ఆశాభావ్యం వ్యక్తం చేశాడు. ప్రధానంగా ఎంఎస్‌ ధోని వన్డే జట్టులో ఉండటం తమకు కొండంత ఆత్మ‌విశ్వాన్ని ఇస్తుందన్నాడు.

వన్డే సిరీస్‌ కోసం భారత్ నుంచి ఆటగాళ్లు బయల్దేరనున్నారు. ఈ క్రమంలో టీమిండియా వన్డే యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా చోటు ద‌క్కించ‌కున్నాడు. టెస్టు సిరీస్‌ ఓటమితో జట్టు ఏమాత్రం కుంగిపోదని అన్నాడు. తిరిగి పుంజుకోగల సామర్థ్యం ఉందని చెప్పాడు. జట్టు సామర్థ్యానికి తోడు ధోనీ రాక జట్టును మరింత బలోపేతం చేయనుందని అన్నాడు. గతంలో టీమిండియాను సఫారీ గడ్డపై నడిపించిన అనుభవం ఉపయోగపడుతుందని చెప్పాడు.

తొడ కండరాల గాయం నుంచి తేరుకున్న అయ్యర్‌.. సఫారీ పర్యటనకు సిద్దమవుతున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ 20 ట్రోఫీలో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ముంబై ఆటగాడు 79 పరుగులతో అజేయంగా నిలిచి పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -