Friday, April 19, 2024
- Advertisement -

ఆదిలోనే స‌ఫారీకీ షాక్‌..టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న స‌ఫారీ జ‌ట్టు..

- Advertisement -

వాండరర్స్‌ వేదికగా ఇండియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ జట్టు సారథి జేపీ డుమిని టీమిండియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పగటి పూటే మ్యాచ్‌ జరుగుతుంది కాబట్టి ఛేదన సులభంగా ఉంటుందని డుమిని అభిప్రాయపడ్డాడు.

ఇప్పటికే వన్డే సిరీస్‌ను 5-1తో గెలుచుకున్న టీమిండియా.. టీ20 సిరీస్‌పైనా కన్నేసింది. ఈ సిరీస్‌కు సౌతాఫ్రికా కెప్టెన్‌గా జేపీ డుమిని వ్యవహరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా టీమ్‌లోకి తిరిగొచ్చాడు. హార్దిక్ పాండ్యా కాకుండా ముగ్గురు రెగ్యులర్ పేసర్లతో ఇండియా బరిలోకి దిగుతున్నది. కుల్‌దీప్‌ను పక్కన పెట్టి జయదేవ్ ఉనద్కట్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అయ్యర్ స్థానంలో మనీష్ పాండే టీమ్‌లోకి వచ్చాడు.

అయితే దక్షిణాఫ్రికా జట్టుకు చివరి నిమిషంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్వంటీ 20 స్పెషలిస్టు ఏబీ  డివిలియర్స్‌ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే ఈ  సిరీస్‌లో డు ప్లెసిస్‌ సేవల్ని కోల్పోయిన దక్షిణాఫ్రికాకు మరో కీలక ఆటగాడు కూడా దూరంగా కావడంతో సిరీస్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, సురేశ్‌ రైనా, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, ఎంఎస్‌ ధోనీ, భువనేశ్వర్‌ కుమార్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, యజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -