లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్లలో భాగంగా మొదటి టీ20 గెలిచిన సంగతి తెలిసిందే. ఈమ్యాచ్ను గెలిచి సీరీస్ను కౌవసం చేసుకోవాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరో వైపు సిరీస్ను నిలుపు కోవాలంటే ఈ మ్యాచ్లో ఖశ్చితంగా గెలవాల్సి ఉంది. భారత జట్టులో ఉమేష్ యాదవ్కు బదులుగా భువనేశ్వర్ కుమార్ ఆడుతుండగా, వెస్టిండీస్ జట్టులో నికోలాస్ పూరాన్ చేరాడు.
నూతనంగా నిర్మించిన లక్నో స్టేడియంలో ఇదే తొలి మ్యాచ్. 50వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలోని టిక్కెట్లన్నీ మ్యాచ్కు వారం రోజుల ముందే హాట్ కేకుళ్లా అమ్ముడుపోయాయి.
జట్ల వివరాలు…
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, రిషబ్ పంత్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్
వెస్టిండీస్: షై హోప్, దినేష రామ్దిన్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మైర్, కిరన్ పొల్లార్డ్, డారెన్ బ్రావో, నికోలాస్ పూరాన్, కార్లోస్ బ్రాత్వైట్ (కెప్టెన్), ఫాబియన్ అలెన్, కీమో పౌల్, ఖేరీ పియరె, ఓషానె థామస్