Tuesday, May 7, 2024
- Advertisement -

ధోనీ రిటైర్మెంట్‌పై చాహల్ షాకింగ్ కామెంట్స్..!

- Advertisement -

భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహల్‌ టైం దొరికినప్పుడల్లా యాంకర్ తరహాలో భారత ఆటగాళ్లను ఇంటర్వ్యూలు తీసుకుని వాళ్లలో సరదా యాంగిల్‌ను బయటకు లాగుతాడు. అయితే చాహల్ ఇటీవలే రిలీజ్ చేసిన ఓ వీడియో మాత్రం ఎమోషనల్ గా ఉంది. ప్రధానంగ భారత మాజీ కెఫ్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పై ఊహగానాలు చెలరేగుతున్న వేళ.. అతనిమాటలు ప్రధాన్యం సంతరించుకున్నాయి.

ప్రస్తుత న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు.. అతిథ్యజట్టుతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. తొలి రెండు మ్యాచ్2లు నెగ్గిన భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. మూడో టీ20 ఆడేందుకుగాను హామిల్టన్ చేరుకుంది. అయితే ఈ ప్రయాణంలో భాగంగా బస్సులో ఒక వీడియో చేసిన చాహల్.. ధోనీని తమ జట్టంతా మిస్సవుతున్నట్లు వెల్లడించాడు. ప్రయాణంలో భాగంగా ధోనీ ఎల్లప్పుడు బస్సు చివరి భాగంలో ఒక మూలకు ఉన్న సిట్ లో కూర్చునేవాడని.. అయితే ఈ సీటు ధోనీ జ్ఞాపకార్థం ఖాళీగా ఉంచినట్లు చాహల్ తెలిపాడు.

అక్కడ లెజెండ్ కూర్చునేవాడని చాహల్ ఈ వీడియోలో స్పష్టంగా తెలిపాడు. ఇంకోవైపు గతేడాది ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్ ముగిశాక టీమిండియాకు దూరమైన ధోనీ.. రీ ఎంట్రీపై ఊహగానాలు చెలరేగుతున్నాయి. దీనిపై ధోనీని అడుగగా సమాధానం దాటవేశాడు. తాజాగా బీసీసీఐ ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులోనూ ధోనీ పేరును తొలగించారు. దీంతో ధోనీ రిటైర్మెంట్ ఖరారైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -