Thursday, May 9, 2024
- Advertisement -

ప్రారంభ‌మ‌యిన ఐపీఎల్ స‌మ‌రం…టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సీఎస్‌కే

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్ మ‌హా స‌మ‌రం ప్రారంభ‌య్యింది. తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ టోర్నీలోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ గెలుపుతో సీజన్‌ని ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతుండగా.. డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ సొంత గడ్డపై సత్తాచాటాలని ఆశిస్తోంది.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతోంది. గతేడాది ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ గెలిచి మూడో సారి టైటిల్‌ నెగ్గిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఫైనల్లో రైజింగ్‌ పుణెతో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో పరుగు తేడాతో విజయం సాధించడం ద్వారా ముంబై కొత్త రికార్డు లిఖించింది. మరొకవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండు సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తాజా సీజన్‌లో ఇరు జట్లు  పటిష్టంగా ఉండటంతో తొలి మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది

ముంబయి ఇండియన్స్ జట్టు: ఎల్విన్ లావిస్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, మయాంక్ మార్కండే, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, క్రునాల్ పాండ్య, మిచెల్ మెక్లనగాన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, జస్‌ప్రీత్ బుమ్రా

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీ(కీపర్/కెప్టెన్), డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్, మార్క్‌వుడ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -