ఐపీఎల్ మ్యాచ్లకు వ్యతిరేకంగా కర్నాటకలో ఆందోళన మరింత ఉదృతంగా సాగుతోంది. కావేరీ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా తమిళనాడు అట్టుడుకుతోంది. ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహిస్తే అడ్డుకుంటామని ఆందోళన కారులు హెచ్చారించారు. వీరి మద్దతుకు పార్టీలతో పాటు సినిమా స్టార్స్ కూడా మద్దతు తెలిపారు.
ఇదిలా ఉంటే మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ తంబీలకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. నేటి సీఎస్కే-కేకేఆర్ మ్యాచ్ను అడ్డుకుని తీరతామన్న ఆందోళనకారులు.. స్టేడియాన్ని ముట్టడించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆందోళన కారులను అరెస్ట్ చేస్తున్నప్పటికీ ….భారీ బద్రత వలయాన్ని చేధించుకుంటూ ఆందోళన కారులు స్టేడియం లోపలకు దూసుకొస్తున్నారు. భారీ భద్రత నడుమ సీఎస్కే-కేకేఆర్ టీమ్ సభ్యులు మైదానంకు చేరుకున్నారు. స్టేడియం దారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. పాసులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తున్నారు.