Friday, May 3, 2024
- Advertisement -

SRH కు గ‌బ్బ‌ర్ గుడ్‌బాయ్‌

- Advertisement -

SRH కు బిగ్ షాక్ త‌గిలింది. ఐపీఎల్‌లో సుదీర్ఘంగా SRH జ‌ట్టుకు ఓపెన‌ర్‌గా ఆడుతున్న ధావ‌న్ ఆజ‌ట్టుకు గుడ్‌బాయ్ చెప్పేశారు. ఈ ఏడాది ఐపీఎల్‌కి ముందు జరిగిన వేలంలో తనని తక్కువ ధరకే ‘రైట్ టు మ్యాచ్ (ఆర్‌‌టీఎం)’ ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ దక్కించుకుందని గుర్రుగా ఉన్న ఈ ఓపెనర్.. జట్టు యాజమాన్యంతోనూ గొడవపడినట్లు వార్తలు వచ్చాయి.

బెంగళూరు వేదికగా జనవరిలో జరిగిన వేలంలో శిఖర్ ధావన్‌ని దక్కించుకునేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆఖరి వరకూ పోటీపడినా.. రూ. 5.2 కోట్లకి ఎస్ఆర్‌హెచ్ ద‌క్కించుకుంది. త‌నకి ఇంకా మంచి ధర వచ్చేదని భావించిన ధావన్.. ఫ్రాంఛైజీ వద్ద అసహనం వ్యక్తం చేసి.. 2019 ఐపీఎల్‌ సీజన్‌లో హైదరాబాద్‌కి ఆడనని తెగేసి చెప్పేశాడట.

శిఖర్ ధావన్ అయిష్టతని పరిగణలోకి తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తాజాగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి అతడ్ని బదిలీ చేసి.. ఆ జట్టు నుంచి విజయ్ శంకర్ (రూ. 3.2 కోట్లు), నదీమ్ (3.2 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.55 లక్షలు)లను తీసుకుంది. ఈ ఏడాది వేలం ప్రకారం ఈ ముగ్గురి ధర 6.95 కోట్లుకాగా.. శిఖర్ ధావన్ ధరని మినహాయించి మిగిలిన సొమ్ముని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి హైదరాబాద్ ఫ్రాంఛైజీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో.. శిఖర్ ధావన్ ధర ఇప్పుడు రూ. 5.2 కోట్ల నుంచి 6.95 కోట్లకి పెరిగినట్లయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -