Wednesday, May 22, 2024
- Advertisement -

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌..

- Advertisement -

ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ సారథి అజింక్యా రహానే ఈ మైదనాం చేజింగ్‌కు కలిసొస్తుండటంతో ఫీల్డింగ్‌కే మొగ్గు చూపాడు. ఇరు జట్లు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు క్వాలిఫైయర్‌-1లో ఓడిన సన్‌రైజర్స్‌తో ఇదే వేదికగా తలపడనుంది.

టోర్నీ లీగ్ దశలో 8 మ్యాచ్‌ల్లో గెలుపొందిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 16 పాయింట్లతో దర్జాగా ప్లేఆఫ్‌కి చేరుకోగా.. ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 పాయింట్లతో నాకౌట్ అర్హత కోసం లీగ్ చివరి మ్యాచ్‌ ఫలితం వరకూ వేచి చూడాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుండగా.. గెలిచిన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే తాజా సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -