Thursday, May 16, 2024
- Advertisement -

కోల్‌క‌తా చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ డేర్ డేవిల్స్…

- Advertisement -

ఐపీఎల్ 2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మళ్లీ పుంజుకుంది. సోమవారం రాత్రి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తోె జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 71 పరుగుల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. 201 పరుగుల లక్ష్యఛేదనలో రిషబ్ పంత్ (43: 26 బంతుల్లో 7×4, 1×6) , మాక్స్‌వెల్ (47: 22 బంతుల్లో 3×4, 4×6) దూకుడుగా ఆడినా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఘోర పరాజయం తప్పలేదు. ఈ సీజన్‌లో పరుగుల పరంగా ఇదే పెద్ద విజయం కావడం విశేషం. కేకేఆర్‌ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌ తలో మూడో వికెట్లు సాధించగా, పీయూష్‌ చావ్లా, రస్సెల్‌, శివం మావి, టామ్‌ కుర్రాన్‌లు తలో వికెట్‌ తీశారు.

అంతకముందు తొలుత ఆండ్రీ రసెల్ (41: 12 బంతుల్లో 6×6), నితీశ్ రానా (59: 35 బంతుల్లో 5×4, 4×6) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ లిన్ (31: 29 బంతుల్లో 4×4, 1×6) జట్టుకి మెరుగైన ఆరంభమివ్వగా.. మిడిల్ ఓవర్లలో రసెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి సిక్సర్లు బాదేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -