- Advertisement -
కోల్కతా నైట్రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్కి వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్లు వరుస బౌండరీలతో హోరెత్తిస్తున్నారు. కోల్కతా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో 6 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. స్ట్రోక్ ప్లేయర్ లోకేశ్ రాహుల్ (37; 14 బంతుల్లో 6×4, 1×6) అందమైన బౌండరీలతో అలరిస్తున్నారు. మరోవైపు క్రిస్గేల్ (35; 22 బంతుల్లో 5×4, 2×6) భారీ సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు. పంజాబ్ విజయానికి ఇంకా 70 బంతుల్లో 96 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి.