ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానె బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే 13 మ్యాచ్లాడిన బెంగళూరు జట్టు ఆరు మ్యాచ్ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. ఆరు మ్యాచ్ల్లో గెలుపొందిన రాజస్థాన్ రాయల్స్ నెట్ రన్రేట్లో వ్యత్యాసం కారణంగా ఆరో స్థానంలో ఉంది. ఇరు జట్లకీ లీగ్ దశలో ఇదే చివరి మ్యాచ్ కావడంతో గెలిచిన జట్టు ప్లేఆఫ్ రేసులో ఉండనుంది.
రాజస్థాన్ తుది జట్టులో మూడు మార్పులు జరిగాయి. జోస్ బట్లర్, బెన్స్టోక్స్ స్థానంలో హెన్రిచ్ క్లాసెన్, బెన్ లాలిన్ జట్టులోకి రాగా.. స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ కూడా మళ్లీ జట్టులోకి వచ్చాడు. మరోవైపు బెంగళూరు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.
బెంగళూరు జట్టు: పార్థీవ్ పటేల్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ, గ్రాండ్ హోమ్, మన్దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, చాహల్
రాజస్థాన్ జట్టు: రాహుల్ త్రిపాఠి, అజింక్య రహానె, సంజు శాంసన్, హెన్రిచ్ క్లాసెన్, స్టువర్ట్ బిన్నీ, గౌతమ్, జోప్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, ఇస్ సోధి, జయదేవ్ ఉనద్కత్, బెన్ లాలిన్