హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా నాలుగో మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, హైదరాబాద్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్లో పాటు రషిద్ ఖాన్, బిల్లీ స్టాన్లేక్, షకీబుల్ హసన్ విదేశీ ఆటగాళ్లు. ఇక రాజస్థాన్ జట్టులో బెన్ స్టో్క్స్, జాస్ బట్లర్, డిఆర్కీ షార్ట్, బెన్ లాగ్లిన్ విదేశీ ఆటగాళ్లు.
ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. ఈ రోజు సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్ను తిలకించేందుకు హైదరాబాద్ నుంచే కాకుండా పలు జిల్లాల నుంచి అభిమానులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మైదానం పరిసర ప్రాంతాల్లో 100 సీసీ కెమెరాలతో నిఘా పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటుచేశారు. సుమారు 2500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వాటర్ బాటిళ్లు సహా 17 రకాల వస్తువులను మైదానంలోకి అనుమతించేందుకు నిరాకరించారు.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), శిఖర్ ధావన్, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, వృద్ధిమాన్ సాహా (కీపర్), మనీష్ పాండే, షకీబల్ హసన్, రషిద్ ఖాన్, యూసఫ్ ఫఠాన్, బిల్లీ స్టాన్లేక్, సిద్ధార్థ్ కౌల్
రాజస్థాన్ రాయల్స్ జట్టు: ఆజింక్య రహానే (కెప్టెన్), డిఆర్కీ షార్ట్, సంజు సామ్సన్, జోస్ బట్లర్ (కీపర్), బెన్ స్టో్క్స్, జయదేవ్ ఉనద్కత్, రాహుల్ త్రిపాఠి, క్రిష్ణప్ప గౌతమ్, శ్రేయాస్ గోయల్, ధవల్ కులకర్ణి, బెన్ లాగ్లిన్