చెన్నై సూపర్ కింగ్స్తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో కోహ్లీసేన ఘోరంగా పారజయం పాలయ్యింది. తమ జట్టు చిత్తుగా ఓడిపోవడం పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. భారీ స్కోరు చేసినా ఓడిపోవడంతో కోహ్లి కలత చెందాడు. 205 పరుగుల భారీ స్కోరును కాపాడటంలో విఫలమైన తమ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
బ్యాట్స్ మెన్లు రాణించి 205 పరుగుల కష్టసాధ్యమైన స్కోరును నమోదు చేసిన తరువాత, 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రత్యర్థిని మరింతగా దెబ్బతీయాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మ్యాచ్ ని చేజేతులా జార్చుకున్నామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమిపై కోహ్లీ స్పందించారు. భారీ స్కోరు చేసినా ఓడిపోయామని, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలం అయ్యారని మండిపడ్డాడు. ఈ విధమైన బౌలింగ్ ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, చివరి ఓవర్లలో అన్నేసి పరుగులు ఇవ్వడం పెద్ద నేరమని అన్నాడు.