Friday, May 3, 2024
- Advertisement -

ముంబైపై గెలిచి టోర్నీని ఆరంభించాల‌నుకుంటున్నాం..సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్‌

- Advertisement -

మ‌రి కొద్ది గంట‌ల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఏర్ప‌ట్ల‌న్నీ పూర్త‌య్యాయి. మొద‌ట ముంబ‌య్ ఇండియ‌న్స్‌, చెన్నైసూప‌ర్ కింగ్స్ మ‌ధ్య మొద‌టి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌పై సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ప్లెమింగ్ స్పందించారు. నేడు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జరగనున్న మ్యాచ్ కు సర్వసన్నద్ధంగా ఉన్నామని కోచ్‌ తెలిపాడు.

తొలిపోరు కావడంతో కొంత ఆందోళనగా ఉన్నప్పటికీ స్థిరంగా ఉన్నామని అన్నారు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ను వాంఖడే స్టేడియంలో ఆడనున్నామని, వాంఖడే స్టేడియంలో మ్యాచ్ అంటే ఒక థ్రిల్‌ ఉంటుందని ఆయన చెప్పారు. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి, టోర్నీకి శుభారంభం ఇవ్వాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ మ్యాచ్ కోసం తమ జట్టు లోని ఆటగాళ్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ, డ్వేన్‌ బ్రావో, షేన్‌ వాట్సన్‌, హర్భజన్‌ సింగ్‌ లు జట్టును ముందుకు నడిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వేలి గాయం కారణంగా తొలి మ్యాచ్ లో డుప్లెసిస్ ఆడడం లేదని ఫ్లెమింగ్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -