- Advertisement -
ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఆర్సీబీ ఓడిపోవడంతో కనీసం ఈ మ్యాచ్తో నైనా బోణీ కొట్టాలని ఎదురు చూస్తోంది. పాయంట్ల పట్టికలో ఆర్సీబీ చివరిస్థానంలో ఉంది. మూడు మ్యాచ్లాడిన కోల్కతా జట్టు.. తొలి రెండు మ్యాచ్ల్లో గెలుపొందినా.. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా ‘సూపర్ ఓవర్’లో ఓడిపోయింది. ఈమ్యాచ్తో గాడిన పడాలని కోల్కతా భావిస్తోంది.