- Advertisement -
ముంబయ్ ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మాకు ఐపీఎల్ యాజమాన్యం భారీ జరిమాణా విధించింది. రెండు రోజుల క్రితం కింగ్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్కు రూ.12 లక్షల బారీ జరిమాణా విధించింది. శనివారం గం.4.00 ని.లకు మొదలైన మ్యాచ్ గం. 7.30ని.లకు ముగియాల్సి ఉన్న ముంబై ఇండియన్స్ స్లో ఓవర్రేట్ నమోదు చేయడంతో మ్యాచ్ ఆలస్యమైంది.
కింగ్స్ పంజాబ్కు నిర్దేశించిన 177 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై నెమ్మదిగా ఓవర్లు వేసింది.ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా స్లో ఓవర్రేట్ తప్పిదానికి కెప్టెన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దాంతో రోహిత్కు జరిమానా తప్పలేదు